Thursday 10 October 2013

జగన్ దీక్షభగ్నం..

వైయస్ జగన్ చేస్తున్న నిరాహార‌దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఐదు రోజులుగా దీక్ష చేస్తున్న ఆయన్ని పోలీసులు బలవంతంగా నిమ్స్‌కి తరలించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ జగన్ చేపట్టిన దీక్ష బుధవారం ఐదో రోజుకు చేరింది. నిమ్స్ ఆస్పత్రిలో వైద్యులు ఆయనకు బలవంతంగా ఫ్లూయిడ్స్ ఎక్కించారు. రాత్రి పది గంటల ప్రాంతంలో పోలీసులు భారీ సంఖ్యలో దీక్షా శిబిరానికి చేరుకున్నారు. జగన్‌ను తరలించడానికి పోలీసులు చేసిన ప్రయత్నాలను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు అడ్డుకోవడానికి ప్రయత్నించారు. చివరకు దీక్షా శిబిరం నుంచి వైయస్ జగన్‌ను తరలించారు.