Monday 16 September 2013

సోనియా ముందు మోకరిల్లండి

చంద్రబాబు నాయుడు ఢిల్లీ ఎందుకు వెళుతున్నారో స్పష్టం చేయాలని వైకాపా నాయకురాలు షర్మిల డిమాండ్ చేశారు. ఆమె చేపట్టిన సమైక్య శంఖారావం బస్సు యాత్ర లో బాగంగా విశాఖ నగరంలోని జగదాంబ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. సోనియా గాంధీకి ముఖ్యమంత్రి కిరణ్, పిసిసి అధ్యక్షుడు బొత్స ఎలా విధేయులో చంద్రబాబు నాయుడు తన విధేయతను ఆమె ముందు ప్రదర్శించేందుకు వెళుతున్నారని అన్నారు. తన ఎమ్మెల్యేలు, ఎంపిలతో అబల ప్రదర్శన చేసి, తనపై ఏ కేసులు లేకుండా చూడాలని వేడుకోడానికి వెళుతున్నారని షర్మిల అన్నారు. రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి రాదు. చంద్రబాబుకు రాష్ట్రంలో ఏ పదవీ దక్కే అవకాశం లేదు. ఆపార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసేస్తే, కనీసం కేంద్ర మంత్రి పదవైనా ఆయనకు దక్కుతుందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడు రెండు నాల్కుల ధోరణితో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఆయన సమైక్య నినాదాన్ని వినిపిస్తేనే సీమాంధ్రలో తిరిగేలా చేయాలని, లేకుంటే ఆయన్ను తరిమికొట్టాలని షర్మిల పిలుపునిచ్చారు.







No comments:

Post a Comment