Monday 23 September 2013

జగన్ అన్నను ను చూసేందుకు తరలివస్తున్న అభిమానులు

దహారు నెలల తర్వాత జననేత జగన్‌మోహన్‌ రెడ్డి జైలు నుంచి విడుదలయ్యే క్షణం కోసం రాష్ట్ర ప్రజానీకం యావత్తూ ఎదురుచూస్తోంది. ఆయన రాకను స్వయంగా చూసేందుకు... ఆ ఆనంద క్షణాలను జగన్‌ సమక్షంలోనే ఆస్వాదించడానికి రాష్ట్రం నలుమూలల నుంచి అభిమానులు హైదరాబాద్‌ చేరుకుంటున్నారు. రాత్రి కడప నుంచి ప్రత్యేక బస్సులో అభిమానులు హైదరాబాద్‌ బయల్దేరారు.

జననేతను స్వయంగా చూసి ఆయనకు శుభాకాంక్షలు చెప్పేందుకు తాము రాజధానికి వస్తున్నామని అభిమానులు చెబుతున్నారు. ఇక  జగన్‌ మోహన్‌ రెడ్డి విడుదల సందర్భంగా చంచల్‌గూడ జైలు పరిసరాల్లో సందడి వాతావరణం కనిపిస్తోంది. పెద్ద సంఖ్యలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు, అభిమానులు తరలిరానున్న నేపథ్యంలో  పోలీసులు చంచల్‌గూడ పరిసరాల్లో బందోబస్తు పెంచారు. బలగాల సంఖ్య పెంచారు.  అలాగే రోడ్డుపై ముళ్ల కంచె పరిచారు.  ఈరోజు మధ్యాహ్నం జగన్ జైలు నుంచి విడుదల కానున్నారు.




No comments:

Post a Comment